హైదరాబాద్: వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ బెటాలియన్లకు చెందిన పోలీసులు శనివారం నిరసన చేపట్టారు. వరంగల్లోని మమ్నూర్ బెటాలియన్ కమాండెంట్ కార్యాలయం వద్ద అధికారులు బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా నల్గొండలోని 12వ బెటాలియన్లో పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించిన నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా పోలీసు సిబ్బంది కుటుంబాలు నిరసనకు దిగాయి.