మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ పండుగ సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పండుగ విశిష్టతను పలువురికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ పత్తి సునీత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని తెలంగాణ సంస్కృతిని చాటారు. కళాశాలలోని విద్యార్థినులు అధ్యాపకుల సహాయంతో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. ఈ వేడుకలలో కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థినులు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగు దనం ఉట్టి పడేలా రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. అనేక సాంప్రదాయ తెలుగు జానపద పాటలు పాడుతూ విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.