calender_icon.png 5 October, 2024 | 2:52 PM

బతుకమ్మ వేడుకల్లో ప్రతి మహిళ పాల్గొనాలి

05-10-2024 11:43:39 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బతుకమ్మ వేడుకల్లో ప్రతి మహిళ పాల్గొని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలని బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత కోరారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట పట్టణానికి చెందిన పలువురు మహిళ కౌన్సిలర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్ లతో కలిసి ఆమె బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. మహిళలందరితో కలిసి బతుకమ్మను పూలతో పేర్చి పాటలు పాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు మహిళా కౌన్సిలర్లు, మెప్మా రిసోర్సు పర్సన్ లు ఉత్సాహాన్ని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.