calender_icon.png 28 September, 2024 | 4:26 PM

తీరొక్క పువ్వులతో ఘనంగా బతుకమ్మ సంబరాలు

28-09-2024 02:43:41 PM

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తీరొక్క పువ్వులను తీసుకువచ్చి బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థినీలు బతుకమ్మల చుట్టూ సాంస్కృతిక పాటలకు ప్రత్యేక నృత్యాలు చేయడంతో పాటు బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను ప్రధానం చేశారు.

పండుగలకు భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని న తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేష్, ఎన్ టి ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. రాజేంద్ర ప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, ఫయాజ్, ఎన్ ఎస్ యు  ఐ నాయకులు శివ, మనిరత్నం  నవీన్, దేవి, రమేష్, నరేష్ , తదితరులు పాల్గొన్నారు