హైదరాబాద్,(విజయక్రాంతి): చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద చేరుకున్నారు. వర్షం కురస్తున్న మహిళలు బతుకమ్మ ఆడారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, వనతి శ్రీనివాసన్, తదితరులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.