26-03-2025 01:34:31 AM
నిజామాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్.
జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్లో నిర్వహించి హత్యకు గురైన ఎర్రబాపు న్యాయవాదికి నివాళి అర్పించి,కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు. ఎర్రబాపు.హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు విధులకు న్యాయవాదులు మంగళవారం దూరంగా ఉన్నరు. ఎర్రబాపు హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టంముందు దోషులుగా నిలబెట్టాలని బార అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ గౌడ్ కోరారు.
దేశ, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలకు గురికావడం ఆవేదన కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హత్యల పరంపర ఆగాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయా ల్సి ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమా వేశాలలో శాసనసభ లో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజ కీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం దాల్చడానికి సహకరించాలని జగన్ కోరారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావ్ ఉపాధ్యక్షులు పెండం రాజు దొంపల్ సురేష్ కార్యదర్శి ఏ దీపక్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ న్యాయవాదులు విఘ్నేష్ పడేగేల వెంకటేశ్వర్ బిట్లా రవి పిల్లి శ్రీకాంత్ ప్రీమ్ కుమార్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు