calender_icon.png 19 April, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు న్యాయమూర్తి రాధారాణిని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కమిటీ

18-04-2025 01:55:30 AM

కోదాడ ఏప్రిల్ 17: హైకోర్టులో సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ రాధరాణి ని కోదాడ బార్ అసోసియేషన్ నూతన కమిటీ కలిసి కోదాడ కోర్టు సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మినారాయణ రెడ్డి మాట్లాడుతూ కోదాడ కోర్టు బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని, కోదాడ కు అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయాలని,ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

హైకోర్టు పీపీ నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకటరావు,దేవబత్తిని నాగార్జున రావు, రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చలం, హుస్సేన్, బండి వీరభద్రరావు పాల్గొన్నారు.