calender_icon.png 27 September, 2024 | 12:51 PM

తెలంగాణ కోసం బాపూజీ అలుపెరగని కృషి

27-09-2024 01:28:14 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): బహు భాషా కోవిదులైన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఐదు దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేశారన్నారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం ఆయన్ను స్మరించుకున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేసిన మహనీయుడు బాపూజీ అన్నారు. సదా ఆయన్ను స్మరించుకునేందుకే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినట్లు సీఎం వివరించారు.