22-04-2025 01:54:28 AM
చేవెళ్ల, ఏప్రిల్ 21 : చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం సా యంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి ఆలూర్, చిట్టంపల్లి గేట్ పరిధి బీజాపూర్ ప్రధాన రహ దారిపై భారీ మర్రి వృక్షం విరిగి పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
సంబంధి త అధికారులు, పోలీసులు చాలా సేపు శ్ర మించి మర్రి వృక్షాన్ని పక్కకు తొలగింది ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈదురు గాలులకు తోడు పలు గ్రామాల్లో వడగళ్లు కూడా పడడంతో మామిడి, వరి, కూరగాయల పంటలు నష్టపోయాయి.