calender_icon.png 22 September, 2024 | 11:09 PM

మంత్రి ఉత్తమ్ ని కలిసిన బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు

22-09-2024 08:42:20 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): హైదరాబాద్ లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షిని ఆదివారం కలిసి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ చైర్మన్ గా నియామకమైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అతని అనుచరులు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులపై క క్షసాదింపు చర్యలతో దాడులకు పాల్పడడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ.. అక్రమ కేసులు పెడుతున్నారని వివరించారు. కష్టకాలంలో ఉన్న అప్పుడు కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచిన తమకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత తమకు ఇబ్బందులు కలుగుతున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రవీందర్ రెడ్డి తమకు అన్ని వేల లా అందుబాటులో ఉంటూ తమకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న వారి సేవలను తప్పకుండా గుర్తిస్తామని ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్ రాథోడ్ ఎలమంచిలి శ్రీనివాసరావు సోమశేఖర రావు భాస్కర్ రెడ్డి నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.