విధుల్లో ఉండగానే అస్వస్థత
కామారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): బాన్సువాడ అటవీరేంజ్ పరిధిలోని నిజాంసాగర్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గులాం దస్తగిరి బాన్సువాడలో కుటుంబలో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం విధులకు హాజరైన దస్తగిరి అస్వస్థతకు గురి కావడంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.