29-04-2025 12:00:00 AM
జిల్లా సహకార అధికారి మోహన్
మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : బ్యాంకుల్లో ఖాతాదారులు తీసుకునే రుణాలు చెల్లింపులతోనే బ్యాంకులు అభివృద్ధి పథంలో నడుస్తాయని జిల్లా సహకార అధికారి (డీసీఓ) బి మోహన్ అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025 సం దర్భంగా యూనివర్సల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో బ్యాంకు చైర్మన్ వినయ్ కుమార్, ఇన్చార్జి సీఈఓ కెవిఎస్ఎన్ మూర్తి తో కలిసి మాట్లాడారు.
బ్యాంకులో తీసుకు న్న రుణం రికవరీ వలన కలిగే లాభాల గురించి సభ్యులకు వివరించారు. ఈ సదస్సులో బ్యాంకు డైరెక్టర్లు కేశవరావు, జి కృష్ణమూర్తి, ఆర్ ప్రసాదరావు, జె శ్రీదేవి, జి రాయలింగు, శ్రీ బి భాను ప్రకాష్, కె బక్కయ్య, కే రత్నం, కే సుశీల, ఎస్ విజయలక్ష్మి, ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.