అర్హులకు రుణాలు ఇవ్వాలి
దిశ సమీక్షలో ఎంపీ మల్లు రవి
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): అధికార యంత్రాంగం సరిగా పని చేయకపోతే రైతులు ఆత్మహత్యల వైపు మళ్లుతారని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి బ్యాంకర్లను ఉద్దేశించి విమర్శించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద ర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలు చూపి కొంత మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని తెలిపారు.
పనిము ట్లు, వ్యవసాయేతర రుణాలు ముద్ర, రుణాల లక్ష్యానికి ఆయా బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదే శించారు. విద్య, వైద్యం, కార్పొరేషన్, గురుకులాలు, పాఠశాలలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, డీఎఫ్వో రోహిత్ గోపిడి, డీసీసీబీ చైర్మన్ మామ్మిళ్ల విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.