18-03-2025 12:00:00 AM
ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె
న్యూఢిల్లీ, మార్చి 17: డిమాండ్లు పరిష్కారానికి హామీ ఇవ్వడంలో ఇండియన్ బ్యాం క్స్ అసోసియేషన్ (ఐబీఏ)విఫలమైనందున దేశ వ్యాప్తంగా 48 గంటలపాటు సమ్మె చే యనున్నట్టు ది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాం క్ యూనియన్స్(యూఎఫ్బీ సోమవారం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా మార్చి 23 అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని ప్రకటనలో పే మార్చి 25 అర్ధ రాత్రి వరకూ ఈ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పించడం వంటి కొన్ని కీలకమైన డిమాండ్లను యూఎఫ్బీయూ కొంత చేస్తోంది.
ఈ క్ర మంలోనే ఐబీఏతో సమావేశంమై డిమాం డ్లు పరిష్కరించాలని కోరింది. సమావేశం సఫలం కాకపోవడంతో యూఎఫ్బీ యూ సమ్మెకు సైరన్ మోగించింది. దీంతో 24, 25 తేదీల్లో సేవలు నిలిచిపోనున్నాయి.