18-04-2025 12:00:00 AM
యువ నటుడు దీక్షిత్శెట్టి హీరోగా అభిషేక్ ఎం దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. బృందా ఆచార్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీదేవి ఎంటర్టైనర్స్ బ్యానర్పై హెచ్కే ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు-, కన్నడ బైలింగ్వల్గా రూపొందిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్కు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది.
గురువారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘హర ఓం’ సాంగ్ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జుధాన్ శ్యాండీ ఈ పాటను డివైన్ వైబ్తో పవర్ ఫుల్ నెంబర్గా కంపోజ్ చేశా రు. ఆశ గురించి తెలియజేసే బట్టు విజయ్కుమార్ లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. మంగ్లీ గాత్రం ఈ గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రానికి అభిషేక్ జే డీవోపీగా, తేజస్ ఆర్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.