చెన్నై: చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియమ్ వేదికగా భారత్,తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ టాస్ గెలిచిన బంగ్లా దేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 21.3 ఓవర్లకు గానూ 85 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో యశస్వీ జైశ్వాల్, 59 బంతులకు 36 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 39 బంతులకు 32 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ లతో బరిలోకి దిగింది. చాలా కాల్ తర్వాత కేఎల్ రాహుల్ టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చాడు. సర్ఫరాజ్ బెంచ్ కే పరిమితం అవుతూండగా అతని స్థానంలోనే కేఎల్ రాహుల్ ను తీసకుని క్యాప్టెన్ రోహిత్ బరిలోకి దిగుతున్నాడు. అనివార్య వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ సీరీస్ ఆడలేకపోయిన విరాట్ కోహ్లి తిరిగి జట్టు లోకి వచ్చాడు.అటు పాకిస్థాన్ లో ముగిసిన టెస్ట్ సిరీస్,ను వైట్ వాష్ చేసి మంచి ఊపులో ఉన్న భారత్పై కూడా గెలిచి సత్తా చాటాలని బంగ్లా టైగర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో సిరీస్ రసవత్తరంగా కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.