కరీంనగర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కరీంనగర్ రన్నర్స్, సైక్లిస్టుల సంఘం, జిల్లా పరిపాలన సహకారంతో సెప్టెంబరు 22న అంబేద్కర్ స్టేడియంలో రెండవ ఎడిషన్ మారథాన్ నిర్వహించనున్నారు. అందు కు సంబంధించిన పోస్టర్ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఆర్సీఏ ప్రెసిడెంట్ పసుల మహేష్ మాట్లాడుతూ.. 3కే, 5కే, 10కే మారథాన్ నిర్వహించన్నుట్లు తెలిపారు. వివరాలకు 7759265758, 8143658008, 9676 499949 నంబర్లలో సంప్రదించాల ని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శివ, అఖిల్, స్వప్న పాల్గొన్నారు.