19-04-2025 12:00:00 AM
పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): సోనియాగాంధీని నకిలీగాంధీ అని ఎద్దేవా చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్.. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంతోనే బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యారనే విషయాన్ని మరిచి పోవద్దని ఆయన హితవు పలికారు. శుక్రవారం దయాకర్ గాంధీభవన్లో మీడి యాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు నకు పాల్పడుతోందన్నారు.