అసలు దోస్తాన్ కేసీఆర్, కాంగ్రెస్ మధ్యనే
కేటీఆర్ వల్లే కేసీఆర్ సర్వనాశనం అయ్యారు..
హైదరాబాద్: కేటీఆర్ ట్విట్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణా, కాశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ ఖర్చు చేసిన డబ్బు బీఆర్ఎస్ దేనని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ఈ పరిస్థికి కారణమని ఆయన విమర్శించారు. కేటీఆర్ వల్ల కేసీఆర్ సర్వనాశనం అయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కానే కాదు.. అసలు దోస్తాన్ కేసీఆర్, కాంగ్రెస్ మధ్యనే ఉందని స్పష్టం చేశారు. హరియాణా, కాశ్మీర్ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపింది వాస్తావం కాదా కేటీఆర్..? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ ఏమైయ్యాయి..? ట్యాపింగ్ లో కేసీఆర్ కు 41 సీఆర్ పీసీ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదు..?, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో స్నేహం లేకపోతే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ ద్వారా విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని బండి సంజయ్ డిమాండ్ చేశారు.