calender_icon.png 28 September, 2024 | 6:52 PM

జగన్ తీరు హిందూత్వంపై దాడి.. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి?: బండి సంజయ్

28-09-2024 04:27:38 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు హిందూత్వంపై దాడి.. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అన్యమతస్థులు డిక్షరేషన్ ఇచ్చి ఆలయాలకు రావడం మామూలేనని బండి సంజయ్ పేర్కొన్నారు. దళితులు.. అసలైన హిందూ ధర్మ రక్షకులు అని ఆయన తెలిపారు. దళితులను క్రైస్తవులుగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. బండ్లగూడ జాగీర్ లో విద్యారణ్య భవన ప్రారంభోత్సవంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.