calender_icon.png 18 October, 2024 | 8:02 PM

గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు

18-10-2024 05:49:42 PM

  • హైదరాబాద్,(విజయక్రాంతి): జీవో 29 వల్ల అభ్యర్థులకు నష్టం కలుగుతుందని, జీవో 29 ప్రబుత్వ అనాలోచిత నిర్ణయం అని బండి సంజయ్ తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళ చేస్తున్న అభ్యర్థులపై  పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని, బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనగుణంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన లేదన్నారు. ప్రణాళిక ప్రకారవే జీవో 29 ఇచ్చారని, నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్ఎస్ ఓడిపోయిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.