calender_icon.png 24 October, 2024 | 2:14 AM

కుక్కునూరు పల్లి మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు బంద్

12-08-2024 01:09:10 PM

కొండపాక: గజ్వేల్ నియోజకవర్గం కుక్కునూరు పల్లి మండలంలోని, హిందూ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మరణ హోమానికి నిరసనగా సోమవారం హిందూ సంఘాలు ఛత్రపతి శివాజీ యూత్, బజరంగ్దళ్ సంయుక్తతంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి వ్యాపార సంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని హిందువులందరూ వ్యాపారస్తులు, అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొని స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ చేశారు.