హైదరాబాద్: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి కలిశారు. ఈ నెల 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలంగాణలో పర్వదినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. దసరా సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 29-9-2009న అలయ్ బలయ్ స్నేహసమ్మేళనాన్ని బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేశారు.