calender_icon.png 5 October, 2024 | 6:51 PM

గరిడేపల్లి మండలంలో డీజేలపై నిషేధం

05-10-2024 04:15:05 PM

హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలో ఈ నెల 14 వరకు డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డిజేలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్స్ ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి ప్రకటనలో తెలిపారని, బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించడం జరిగిందని,అందువల్ల గరిడేపల్లి మండలంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ అధిక శబ్ధం కలిగించే డి‌జేలను వినియోగించరాదన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఉల్లంఘించి, ఎవరైనా వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో గరిడేపల్లి మండల పోలీసు వారికి సహకరించాలని గరిడేపల్లి ఎస్సై నరేష్ సూచించారు.