calender_icon.png 28 September, 2024 | 7:04 AM

ఫైనల్లో బాంబ్రీ, ప్రశాంత్ జోడీలు

24-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్లు యూకీ బాంబ్రీ, ప్రశాంత్-జీవన్ జోడీలు వేర్వేరు అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో ఫైనల్లో ప్రవేశించారు. చెంగ్డూ ఓపెన్‌లో భాగంగా సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో యూకీ బాంబ్రీ-అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 6-3, 7 ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)-రాఫెల్ మటోస్ (బ్రెజిల్) జంటను చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో టాప్ సీడ్ సాదియో డౌంబియా-ఫాబియన్ రిబౌల్ (ఫ్రాన్స్) జంటను ఎదుర్కోనుంది. ఇక హాంగ్జౌ ఓపెన్‌లో బరిలోకి దిగిన భారత డబుల్స్ ద్వయం జీవన్- విజయ్ ప్రశాంత్ సెమీస్‌లో 0-6, 6-2, 10-4తో మూడో సీడ్ బెహర్ (ఉరుగ్వే)-రాబర్ట్ గాలోవే (అమెరికా) జంటను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.  ఫైనల్లో జీవన్-విజయ్ జోడీ జర్మనీ అన్‌సీడెడ్ ఫ్రాంట్ జెన్ జంటను ఎదుర్కోనుంది.