విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విష యం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామాను దిల్ రాజు సమర్పణలో శిరీశ్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పొల్లాచ్చిలో ఓ భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్లో మరో కొత్త షెడ్యూల్ను ప్రారంభించారు. వెంకటేశ్తోపాటు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే, శనివారం ఈ సెట్స్లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. బాలయ్య రాకతో టీమ్ చాలా థ్రిల్ అయ్యింది. ఈ సందర్భం.. బాలకృష్ణ, వెంకటేశ్ మధ్య ఉన్న మంచి స్నేహబంధాన్ని మరోమారు చాటినట్టయ్యింది.