calender_icon.png 19 October, 2024 | 6:16 AM

సత్యేందర్ జైన్‌కు బెయిల్

19-10-2024 02:03:18 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ సీఎం ఆతిశీ ఆయనకు స్వాగతం పలికారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)కింద నమోదైన కేసులో జైన్ 18 నెలలుగా జైలులో ఉన్నారు.

బెయిల్‌పై విచారణ సందర్భంగా.. పీఎంఎల్‌ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యం. సత్యేందర్ సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉన్నా రు. ఆప్ నేత మనీశ్ సిసోడియా కేసులోనూ సత్వర విచారణ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. త్వరగా కేసును ముగించాలి అని ఈడీని ఆదేశించింది.