మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్
జనగామ, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ కొనియాడారు. ఆదివారం జనగామ జిల్లా లింగాలఘణపురం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం బీసీ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షా కిట్లు పంపిణీ చేశారు. దసరా లోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కుల గణన జరిగిన తరువాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్, కాంగ్రెస్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, సిద్ధూగౌడ్, జక్కుల వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.