12-04-2025 10:02:47 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షుడు సంకాబద్రి నారాయణను ఆ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించారు. బద్రి నారాయణతో పాటు మరో ఆరుగురికి ఈ కమిటీలో చోటు దక్కింది. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి బద్రి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.