calender_icon.png 24 October, 2024 | 12:07 AM

పార్టీ ఫిరాయింపులతో నీచ రాజకీయాలు

15-07-2024 12:49:22 AM

కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి కూడా అనుభవించాల్సిందే

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

గజ్వేల్, జూలై 14: పార్టీ ఫిరాయింపులతో సీఎం రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్‌కు పట్టిన గతే నాలుగున్నరేం డ్ల తర్వాత రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మం డిపడ్డారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం గజ్వేల్‌లో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొం దుతున్నారని అన్నారు. ప్రతి రోజు భారత రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్‌లో ప్రదర్శిస్తున్న రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించా రు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అయిల మహేందర్ పాల్గొన్నారు.

గుంపు మేస్త్రీకి రాజ్యాంగం తెలియనట్లుంది..

సిద్దిపేట: గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డికి రాజ్యాంగం గురించి తెలియనట్టుందని, చదవడం రాకపోతే తన సెక్రటరీలతో చదివిం చుకోవాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయం ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన మొక్క నాటారు. ఆనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఉం డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యంగంలోని ఏ పేజీలో రాసి ఉందో చెప్పాలని ప్రశ్నించారు.