calender_icon.png 29 September, 2024 | 11:11 PM

ఆర్టీసీ బస్సులో బిడ్డకు జననం

29-09-2024 12:22:46 AM

కోదాడ, సెప్టెంబర్ 28: సూర్యాపేట జి ల్లా కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో శనివా రం కోదాడ మండలం గుడిబండకు చెందిన గర్భిణి అలివేలు సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తున్నది. బస్సు మునగాల మండలం తాడువాయి స్టేజీ వద్దకు రాగానే అలివేలుకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. తోటి మహిళా ప్రయాణికు లు అలివేలుకు పురు డు పోయగా పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. అనంతరం అక్కడి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది తల్లి, బిడ్డను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను కోదాడ డిపో మేనేజర్ అభినందించారు.