calender_icon.png 18 October, 2024 | 2:22 PM

దవాఖాన బాత్రూంలో పసికందు మృతదేహం

18-10-2024 01:42:34 AM

హుజూరాబాద్‌లో మరో ఘోరం 

హుజురాబాద్, అక్టోబర్ 17 : ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు దగ్గర గల బాత్‌రూమ్‌లో పసికందు మృతదేహం లభ్యమవడంతో కలకలం మొదలైంది. వివరాల్లోకెళ్తే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం కలకలం రేపింది. బాత్‌రూంకి వెళ్లిన ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసి వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. 

దవాఖాన వైద్యుల సమాచారంతో హుజురాబాద్  పోలీసులు అక్కడికి చేరుకుని, నవజాత శిశు మృతదేహాన్ని పరిశీలించారు.  సీసీ ఫుటేజ్  ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అన్ని కోణాల్లో  విచారణ చేస్తున్నారు. ఆస్పత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళ ఈ పని చేసిందా? లేదా బయటి నుంచి తీసుకొచ్చి ఎవరైనా అక్కడ పడేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.