హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): టీజీ ఎప్సెట్ (ఎంపీసీ స్ట్రీమ్) విద్యార్థుల కోసం బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్ప టికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 25 వరకు ఆప్షన్స్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 27న సీట్లు కేటాయించనున్నారు. 28 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి సీటు పొందిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 29 లోపు నేరుగా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల ని అధికారులు పేర్కొన్నారు.