20-04-2025 07:00:08 PM
అశ్వాపురం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం-2025పై అవగాహన సదస్సు సోమవారం మండలంలోని తుళ్లూరి ఫంక్షన్ హాల్ నందు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు అశ్వాపురం తహసీల్దార్ స్వర్ణలత(Tahsildar Swarnalata) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ పాల్గొంటారని ఈ అవగాహన సదస్సులో అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆమె కోరారు.