30-04-2025 12:15:48 AM
చేగుంట, ఏప్రిల్ 29 :జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మోసపూరిత ఫోన్ కాల్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ నేరాలకు మోసపోతే, అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు, 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీ చైతన్య రెడ్డి, ఎస్.ఐ-2 బిక్యానాయక్, ఏఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు రవీందర్, వెంకటేష్, మహేష్ పాల్గొన్నారు.