06-02-2025 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి),: సైబర్ జాగృత దివాస్ సంధర్బంగా సైబర్ క్రైమ్ పై బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ,క్రిప్ట్ కరెన్సీ ,బిట్ కాయిన్ ఫ్రాడ్ , పిరమిడ్ మల్టి లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ , జంపుడ్ డిపాజిట్ ఫ్రాడ్ ,డిజిటల్ అరెస్ట్ ,APK ఫైళ్లు, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్ ,ఇన్వెస్ట్మెంట్స్ (స్టాక్) మోసాలు,డైల్ 1930 ప్రాముఖ్యత, గోల్డెన్ అవర్ ప్రాముక్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సైబర్ కానిస్టేబుల్ ప్రవీణ్, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.