28-04-2025 12:05:10 AM
మద్నూర్, ఏప్రిల్ 27: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 29న మంగళవారం భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ ఎండి ముజీబ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం ఉదయం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంత రావు అదే విధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నతాధికారులు హాజరు కానున్నారని రైతులు సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు.