calender_icon.png 29 April, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు

28-04-2025 12:05:10 AM

మద్నూర్, ఏప్రిల్ 27: కామారెడ్డి జిల్లా  మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో  ఈ నెల 29న మంగళవారం భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ ఎండి ముజీబ్   ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం ఉదయం  రైతు వేదికలో  భూభారతి చట్టం అవగాహన సదస్సు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంత రావు అదే విధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి  ఉన్నతాధికారులు హాజరు కానున్నారని రైతులు సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు.