27-04-2025 06:38:44 PM
తాహసీల్దార్ ఎండి ముజీబ్..
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 29న మంగళవారం భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ ఎండి ముజీబ్(Tahsildar MD Mujeeb) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అదే విధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నతాధికారులు హాజరుకానున్నారని రైతులు సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు.