భైంసా (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా డివిజన్కు చెందిన ప్రఖ్యాత సీనియర్ జర్నలిస్ట్, ఉర్దూ ప్రెస్ క్లబ్ భైంసా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జావేద్ సాహిల్కు ఆయన పాత్రికేయ సేవలకు గుర్తింపుగా తంజీమ్ ఖాద్మీన్ అమ్మత్ మహారాష్ట్ర వారు "అఫ్తాబ్ సహాఫత్" అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవం మహారాష్ట్రలోని నాందేడ్లోని హైదరాబాద్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు. దీనిలో రాజకీయ, సామాజిక, మతపరమైన ప్రముఖులతో పాటు వివిధ వార్తాపత్రికల సంపాదకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సయ్యద్ జావేద్ సాహిల్ను సత్కరించారు. జర్నలిజం రంగంలో ఆయన కృషి, అంకితభావం, అత్యుత్తమ పాత్రకు గుర్తింపుగా ఈ అవార్డు, ప్రశంసా పత్రం ఆయనకు అందజేసి అభినందించారు.