12-02-2025 01:49:26 AM
సిరిసిల్ల, ఫిబ్రవరి11(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటో బోల్తా పడగా, గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రి వేములవాడ తర లించారు. అందులో ఒకరికి తలకి తీవ్ర గా యం అవడం వల్ల కరీంనగర్కి తరలిం చారు. మరొకరిని సిరిసిల్లకి తరలించారు. మిగిలిన 9 మందిలో ఇద్దరికీ ఎముకలు విర గగా వారిని ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేస్తు న్నారు. మిగిలిన ఏడుగురు చిన్న గాయాలు కాగా అందరికీ ఎక్స్రేలు తీసి ప్రథమ చికిత్స చేసి పంపారు.
జిల్లా వైద్యాధికారి డా. రజిత పరామర్శించారు.జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ జా క్షతగాత్రులకు అవసరమయిన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. స్థానిక ఎంఎల్ఎ విప్ ఆది శ్రీనివాస్ సూపె రిండెంట్ డా.పెంచలయ్య కి ఫోన్ చేసి వారి కి అవసరమయిన వైద్యం అందించాలని తెలియజేసారు. వైద్యులు డా పెంచలయ్య, డా.అనిల్, డా.చారి, డా.పరమేశ్వరి ఇతర సిబ్బంది సేవలు అందించారు.