13-03-2025 01:58:23 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): ప్రజలు అనేక సమస్యలతో అధికారుల వద్దకు వస్తుంటారని.. వాటిని పరిష్కరించడం తమ బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు భావించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇక్కడికి వెళ్లు.. అక్కడి అధికారిని కలువు అని ప్రజలను తిప్పొద్దని సూచించారు.
బుధవారం పౌర కేంద్రీకృత పాలనలో ప్రజావాణి, ప్రజాపాలన పాత్ర అనే అంశంపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీ జరిగిన చర్చా కార్యక్ర ఆయన పాల్గొన్నా రు. హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తున్న తీరును, పరిష్కారం చేసిన అంశాలను, ప్రజలకు కలిగే మేలును పవర్ పా ప్రజెం టేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమ పరిష్కారానికి ప్రజావాణి వేది నిలుస్తుంద న్నారు. దీంతో సత్వర న్యాయం జరగడంతో పాటు ప్రజ ప్రభు త్వంపై నమ్మకం కలిగేలా ఉపయోగ పడుతుంద న్నా రు.
అందుకే తాను పనిచేసిన ప్రతిచోట ప్రజా ఫిర్యాదు లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, దీంతో కిందిస్థా సిబ్బంది ఎలా పని చేసున్నారో తెలుసుకునేం దుకు వెసులుబాటు లభించింద న్నారు. హైడ్రాలో ఇంకా ౧౦ వేల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.