22-03-2025 07:52:17 PM
కల్లూరు,(విజయక్రాంతి): మండలం కిష్టయ్య బంజర్ గ్రామ పంచాయతీకి మూడు నాలుగు నెలల నుండి గ్రామంలో డ్రైనేజీ పూడిక తీసే వారు లేక మురుగు నీరు పేరుకుని పోయి దుర్గంధం వెదజల్లుతుందని అలాగే రోడ్డు మీద వేసినటువంటి చెత్త శుభ్రం చేసే సిబ్బంది లేక రోడ్ల పైన చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి అని వెంటనే అధికారులు పంచాయతీ సిబ్బంది స్పందించి సమస్యలు పరిస్కారం చూపాలి అని కిష్టయ్య బంజర్ ప్రజలు కోరుకుంటున్నారు.