calender_icon.png 26 October, 2024 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూఎస్, కెనడా బాటలో ఆస్ట్రేలియా

02-07-2024 05:04:46 AM

  • భారత్ విద్యార్థుల వీసా ఫీజు రెట్టింపు

కాన్‌బెర్రా: విదేశీ విద్యార్థుల వలసలను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశీ విద్యార్థుల వీసా ఫీజు దాదాపు రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన వీసా ఫీజు జూలై ఒకటో తేదీ (సోమవారం) నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఇంతకుముందు వీసా ఫీజు 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉండగా, దాన్ని 1600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు విజిటర్ వీసాతోపాటు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాతో ప్రస్తుతం దేశంలోనే ఉన్న వారు ‘విద్యార్థి వీసా’ కోసం దరఖాస్తు చేయకుండా నిషేధం విధించింది.

రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడంతోపాటు విదేశీ విద్యార్థులకు వసతి దొరకడం దుర్లభంగా మారింది. ‘మా అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించేందుకు ఈ రోజు ఈ మార్పులు తీసుకొచ్చాం. స్వేచ్ఛగా, ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం’ అని ఆస్ట్రేలియా హోంమంత్రి క్లేర్ ఓ నీల్ తెలిపారు. విద్యాభ్యాసానికి వెళ్లాలంటే భారతీ య విద్యార్థులు అమెరికా, కెనడా ఆప్షన్ ఎంచుకునే వారు.

కానీ ఆ రెండు దేశాల విద్యార్థి వీసాలు సుమారు 185 అమెరికా డాలర్లు, 110 అమెరికా డాలర్లు (కెనడా వీసా ఫీజు) పెరిగాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసం చేయాలని భావించే భారతీయ విద్యార్థులు ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నారు. 2022--23లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వస్తున్న విద్యార్థులు 30 శాతం పెరిగారు. 2022-23లో 1.50 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియాకు వచ్చారు.