బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు మహాశివరాత్రి జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ప్రసాదాలు, కొబ్బరికాయలు అమ్ముకోవడం, వాహనాల పార్కింగ్, తై బజార్ నిర్వహణ కోసం ఈ వేలం పాటలో పాల్గొనే వారు ముందస్తుగా రూ.20 వేలు డిపాజిట్ చెల్లించాలని వారు కోరారు.