calender_icon.png 23 September, 2024 | 4:01 PM

ఆలయంలో చోరీకి యత్నం

23-09-2024 01:14:48 AM

దొంగలను పట్టుకున్న గ్రామస్థులు

పోలీసులకు అప్పగింత

కొండపాక, సెప్టెంబర్ 22: కొండపాక మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీకి యత్నించిన ఇద్దరిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా నిలబ డి ఉన్నారు. ఆ సమయంలో పొలాల వద్దకు వెళ్తున్న గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారిని చూసి దగ్గరకు వెళ్లారు. వివరాలు అడగగా తాము ఆలయంలో నిద్రించడానికి వచ్చినట్లు చెప్పారు. అయితే, గ్రామస్థులకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో  అందులోని ఒకరు తన వద్ద ఉన్న కత్తితో గ్రామస్థులను బెదిరించాడు. దీంతో వారు గ్రామానికి వెళ్లి మరికొంత మందికి సమాచారం ఇవ్వడంతో అందరూ కలిసి వెళ్లారు. అప్పటికే దొంగలు ఆలయం గల్లపెట్టెను పగులగొట్టారు. గ్రామస్థులు పట్టుకొని ప్రశ్నించగా ఒకరిది కుక్కునూరుపల్లి, మరొకరిది కిష్టాపూర్ అని తేలింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను స్టేషన్ తీసుకెళ్లారు.