- పట్టుకొని చితకబాదిన స్థానికులు
- నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గజ్వేల్, సెప్టెంబరు 20: చిన్నారిని అపహరించేందుకు యత్నించిన నలుగురిని స్థాని కులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘట న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పల్లెపహాడ్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన సింగరమైన యాదయ్య కుమార్తె భార్గవి 21 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. గురువా రం శిశువుకు నామకరణ కార్యక్రమం నిర్వహించారు.
శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ముగ్గురు పురుషులు, ఒక మహిళ యాద య్య ఇంటి సమీ పంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఇంట్లో చొరబడ్డారు. శిశువును అపహరించేందుకు యత్నించగా, యాదయ్య కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకొని వారిని చితకబాదారు. స్థాని కుల సమాచారం మేర కు గజ్వేల్ సీఐ సైదా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.