calender_icon.png 23 October, 2024 | 7:55 PM

దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

23-10-2024 05:14:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం నిర్మల్ లో హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన చేశారు. పట్టణంలోని శివాయిశోకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాదులోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నరేందర్ మెడిసిమ్మరాజు అర్జున్, రవి, ఆనంద్, తదితరులు ఉన్నారు.