బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దాడులు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు బడికల శ్రావణ్, అరుణ్, రోషన్, ప్రసాద్, కిరణ్, సంతోష్, రాజ్ కుమార్ లు సోమవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ ఇంటిపై పోలీసులతో ప్రభుత్వం దౌర్జన్యంగా దాడులు చేస్తుందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై చాలా ఆరోపణలున్నాయని, వారి ఇళ్లపై దాడులు చేసే దమ్ముందా అని నిలదీశారు. కాంగ్రెస్, బిజెపి కలిసే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఏమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్, సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా దాడులు చేస్తారన్నారు. తెలంగాణ ప్రజలే కేటీఆర్ ను కాపాడుకుంటారన్నారు, తెలంగాణలో గృహప్రవేశానికి దావతులు చేసుకోవడం సర్వసాధారనమేనన్నారు.