calender_icon.png 2 October, 2024 | 4:13 AM

జింకలపల్లి రైస్ మిల్లులో దాడులు

02-10-2024 12:53:46 AM

52 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం 

అలంపూర్, అక్టోబర్ 1: ఎర్రవల్లి మండలం జింకలపల్లి గ్రామ శివారులో ఉన్న పద్మావతి శ్రీనివాస్ రైస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో మంగళవారం పోలీసులు దాడులు చేసి 52 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇటిక్యాల ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని సమాచారం రావడంతో దాడులు నిర్వహించినిల్వఉంచిన 52 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.