అక్రమ మద్యం స్వాధీనం, పలువురిపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి) : శంషాబాద్, మేడిపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ఫామ్హౌజ్లపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిం చారు. ఈ సందర్భంగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని పలువురిపై కేసు నమో దు చేశారు. ఆదివారం శంషాబాద్ ఎక్సైజ్ పరిధిలోని 9 ఫామ్ హౌజ్లను తనిఖీ చేయగా.. అత్తాపూర్లోని మెగా ఫామ్హౌజ్, సురంగల్లోని ఎన్ఎంఆర్ ఫామ్హౌజ్లలో పలువు రు నాన్డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 48 బీర్లు, 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణప్రియ తెలిపారు. మరోవైపు, మేడిపల్లి పరిధిలోని సావి సెరేంట్లీ అనే ఫామ్ హౌజ్లో ఎక్సైజ్ అధికారు లు శనివారం రాత్రి దాడు లు నిర్వహించగా.. 14 లీటర్ల మద్యాన్ని స్వా ధీనం చేసుకుని, ఒకరిపై కేసు నమోదు చేసినట్లు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. ఎక్సైజ్ అనుమతి లేని మద్యాన్ని వినియోగించే వారి పై కేసులు నమోదు చేస్తామని, అనుమతించే ఫామ్ హౌజ్లను బ్లాక్ లిస్ట్లో పెడుతామని హెచ్చరించారు.